pop

ఢిల్లీలో 20 వేలకు చిల్లర ఇచ్చారు.. ఎన్ని కేజీలు వచ్చిందో తెల్సా?


న్యూఢిల్లీ: అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఖాతాదారుకు బ్యాంక్ సిబ్బంది షాకిచ్చారు. 20 వేల రూపాయలు కావాలని అడిగిన ఇంతియాజ్ ఆలమ్‌కు నోట్లు లేవని చెప్పారు. పది రూపాయల కాయిన్స్ ఉన్నాయని కావాలంటే తీసుకోవచ్చన్నారు. దీంతో మళ్లీ లైనులో నిలబడే ఓపిక లేక ఇంతియాజ్ మొత్తం 20 వేల రూపాయలకు సరిపడా పది రూపాయల కాయిన్స్ తీసుకుని వెళ్లిపోయారు. తనకు ఎదురైన ఈ వింత అనుభవం గురించి ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. బ్యాంకు వాళ్లు ఇచ్చిన చిల్లరను తూకం వేయగా 15 కేజీలు ఉన్నట్లు ఇంతియాజ్ తెలిపారు. నోట్ల రద్దుతో ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఎదురౌతోంది.

No comments:

Powered by Blogger.