pop

రూ.2వేల నోటుపై వస్తున్న పుకార్లకు ఇదే సమాధానం


కరెన్సీ నోట్లపై రంగు పోవడం సహజంగా జరిగేదేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. అన్ని నోట్ల రంగూ క్రమంగా పోతుందంటూ పాత నోట్లపై ఇంకును తుడిచి మరీ చూపించారు. కొత్తగా ముద్రించిన రూ.2000 నోటుపై ఇంకు చెరిగిపోతుండడం, దీనిపై సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుండడాన్ని మీడియా ప్రతినిధులు సోమవారం పార్లమెంటు ఆవరణలో జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన సమాధానం చెప్పకుండా.. తన పర్సులోని రూ.100 నోటును బయటకు తీశారు. ఆ నోటుపై నాప్‌కిన్‌ పేపర్‌ పెట్టి గట్టిగా తుడిచారు. ఆ పేపర్‌కు రంగు అంటుకోవడాన్ని చూపిస్తూ.. పాత నోట్లకే రంగు పోతుంటే కొత్తగా వచ్చిన దానికి పోదా? అని ప్రశ్నించారు

No comments:

Powered by Blogger.