గాలి పెళ్లిలో డ్యాన్స్.. రకుల్కు ఐటీ నోటీసులు?
బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి దక్షిణాదికి చెందిన రాజకీయ ప్రముఖులతోబాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలందాయి. అయితే అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జనార్ధనరెడ్డి ఇంట పెళ్లికి వెళ్లడానికి చాలా మంది భయపడ్డారు. ఆ పెళ్లికి దాదాపు 500 కోట్ల రూపాయులు ఖర్చైందని టాక్. ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకలో సందడి చేసిన కొంతమంది సెలబ్రిటీలకు భారీగా డబ్బులు అందాయని వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో డ్యాన్స్ చేసిన తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్లు ఒక్కొక్కరు కోటి రూపాయలు అందుకున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు రకుల్కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. ఇప్పటికే గాలి వారింట పెళ్లిపై కన్నేసిన ఐటీ శాఖ.. ఆ పెళ్లికి అంత డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందని ఆరా తీస్తోంది. అలాగే డబ్బు పుచ్చుకున్న వారికి కూడా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చాయట. అలా నోటీసులు అందుకున్న వారిలో రకుల్ కూడా ఉందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే రకుల్ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేస్తోంది. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, తను చాలా ప్యూర్ అని అంటోంది ఈ ఢిల్లీ బ్యూటీ. మరి, రకుల్ ఎంత ప్యూరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
No comments: