pop

ఏడుగురి ప్రాణాలు కాపాడిన.. వృద్ధురాలి చేతి కర్ర


కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సుమారు 150 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఓ వృద్ధురాలి చేతి కర్ర ఏడుగురి ప్రాణాలు కాపాడింది. పాట్నాకు చెందిన మనోజ్ చౌరాసియా ఇండోర్ నుంచి సొంతూరు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇండోర్-పాట్నా ఎక్స్‌‌ప్రెస్‌ ఎక్కారు. ఈ రైలు ఆదివారం కాన్పూర్ వద్ద ప్రమాదానికి గురికావడంతో వీరంతా ఏసీ కోచ్‌లో చిక్కుకుపోయారు. అయితే తల్లి చేతి కర్ర ఆ కుటుంబాన్ని కాపాడింది. కుమారుడు మనోజ్ చౌరాసియా ఆమె చేతి కర్రతో ఏసీ కోచ్ అద్దలు పగులగొట్టారు. దీంతో వారంతా సురక్షితంగా అందులోంచి బయటపడ్డారు. ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానానికి చేరారు.

No comments:

Powered by Blogger.