ప్రత్యేక గీతంతో అమీషా రీ ఎంట్రీ
హైదరాబాద్: బద్రి, నాని తదితర చిత్రాల్లో కథానాయికగా అలరించిన బాలీవుడ్ నటి అమీషా పటేల్ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్లో నటిస్తున్నారు. 40 ఏళ్ల అమీషా ‘ఆకతాయి’ అనే చిత్రంలోని ప్రత్యేక గీతంలో ఆడిపాడుతున్నారు. ఆశిష్రాజ్ కథానాయకుడిగా రాం భీమన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకతాయి’. రుక్సర్ మీర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.కె.ఎ. ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో అమీషా నటిస్తున్న చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ సారధి స్టూడియోస్లో జరుగుతున్నట్లు పేర్కొంది. పాట షూటింగ్లో తీసిన ఫొటోలను విడుదల చేసింది.
No comments: