pop

మసీదు నుంచి అజా వస్తుందని ప్రసంగాన్ని నిలిపివేసిన సోనియా గాంధీ


అలహాబాద్: ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి అజా రావడంతో ఆమె తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అజా పూర్తయ్యాక ఆమె తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. కార్యక్రమానికి సోనియా కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా వాద్రా కూడా హాజరయ్యారు. దేశాన్ని మరింత శక్తిమంతం చేయాలని ఇందిరాగాంధీ కలలు కన్నారని సోనియా చెప్పారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ ఓ బహిరంగసభలో ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి అజా రావడంతో తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అజా పూర్తయ్యాక తన ప్రసంగాన్ని కొనసాగించారు.

No comments:

Powered by Blogger.