pop

చదువుకోవడానికి అమెరికా వెళ్లి వ్యభిచారం


మియామి:ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగించవచ్చునని అమెరికా వచ్చే విద్యార్థులను వ్యభిచార వృత్తిలోకి దించుతున్న 46 ఏళ్ల వ్యక్తికి న్యాయస్థానం జీవితకాల జైలు శిక్షను విధించింది. జఫ్రీ జాన్సన్ అనే నిందితుడు అమెరికా వచ్చే విద్యార్థులకు డబ్బును ఎరగా చూపించి విద్యార్థులను వ్యభిచార వృత్తిలోకి దించుతున్నాడు. ‘డా. జనార్థన దాస్’ యోగా కేంద్రం ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. యోగా కేంద్రం అనుకుని వచ్చిన ఓ మహిళ షాక్‌కు గురైంది. యోగా పేరుతో బాడీ మాసాజ్ చేస్తూ, వ్యభిచారం నిర్వహిస్తుండడాన్ని ఆ మహిళ పోలీసులకు సమాచారమిచ్చింది. కేసు విచారణ జరిపిన పోలీసులు నిందితుడికి 2.7 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా విధించారు. చదువుకోవడానికి అమెరికా వచ్చే విద్యార్థులలో ఎక్కువమంది ఇలాగే వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నారని, ఈ ఘటన మరోసారి నిరూపించిందని కేసును విచారణ చేసిన యుఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మియామి అధికారి ‘చార్జ్ మార్క్ సెల్బీ’ తెలిపారు.

No comments:

Powered by Blogger.