pop

బాబాయ్, అబ్బాయ్.. డైరెక్టర్లను ఎక్స్‌చేంజ్ చేసుకున్నారా?


ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వందో చిత్రం చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్‌లో గౌతమిపుత్ర శాతకర్ణిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అనుకున్న టైం కంటే ఒక్క రోజు ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. ఇక, ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో 101వ సినిమాగా రైతుగా కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే.. కారణమేంటో తెలియదు కానీ, ఆ సినిమాను బాలయ్య పక్కకు పెట్టినట్టు చెప్పుకొంటున్నారు. వేరే దర్శకుడితో చేయడానికి సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్.. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినా అదేదీ సెట్ అయినట్టు కనిపించలేదు. ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమాపై అదే డైలమా కొనసాగుతోంది. పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రీసెంట్‌గా వీవీ వినాయక్, సింగం డైరెక్టర్ హరి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఏదీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్‌ల గురించి ఒకేసారి చెప్పాల్సిన అవసరమేముందని అనిపించొచ్చు. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. వారి సినిమాలపై ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఇద్దరు హీరోలు తమ..తమ డైరెక్టర్లను ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే.. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత రైతు సినిమాను తీయాలనుకున్నా.. పక్కనపెట్టాడంటున్నారు. తన తర్వాతి సినిమాను పూరీ జగన్నాథ్‌తో తీయాలని బాలయ్య భావిస్తున్నాడట. అందుకే తొలుత పూరీకి దాదాపు ఫిక్స్ అయిన ఎన్టీఆర్.. ఆ సినిమా (డైరెక్టర్)ను బాబాయ్‌కు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడట. ఇక, ఇటు కృష్ణవంశీ సినిమాలో ఎన్టీఆర్ నటించేందుకు ఓకే చెప్పాడని టాలీవుడ్‌లో టాక్. అంటే ఇద్దరూ తమ..తమ డైరెక్టర్లను ఎక్స్‌చేంజ్ చేసుకుని.. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని చాటిచెప్పారంటూ సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇలాంటి సుహృద్భావ వాతావరణంలో ఎక్స్‌చేంజ్ జరిగి.. తమ మధ్య గొడవలు లేవని చాటిచెప్పడం నిజంగా మంచిదేనని నందమూరి ఫ్యామిలీ అభిమానులు అనుకుంటున్నారు.

No comments:

Powered by Blogger.