pop

‘శివలింగ’గా వస్తున్న లారెన్స్‌


హైదరాబాద్‌: రాఘవ లారెన్స్‌, రితికా సింగ్‌ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘శివలింగ’. అభిషేక్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకుడు. రమేష్‌ నిర్మాత. పి.వాసు తనయుడు శక్తివాసు కీలక పాత్రలో నటించారు. తెలుగులో ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ.. ‘కాంచన హిట్‌ అయ్యింది. గంగ పెద్ద హిట్‌ అయ్యింది. గంగ కంటే గొప్ప హిట్‌ మూవీ చేయాలని ఎదురుచూస్తున్న సమయంలో వాసు ‘శివలింగ’ సినిమా కోసం అడిగారు. కథ నచ్చడంతో నటించడానికి ఒప్పుకొన్నా. ఈ సినిమాకు కథే మొదటి హీరో. రితికా సింగ్‌ రెండు.. శక్తివాసు మూడు.. అయితే నేను నాలుగో హీరో అవుతానంతే. సినిమా అంత మంచి కథతో రూపొందింది’ అని అన్నారు. డిసెంబర్‌ తొలి వారంలో పాటలను, జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు.

No comments:

Powered by Blogger.