pop

సిద్ధార్థ్‌తో మాట్లాడట్లేదంటే బాధగా ఉంది


బా లీవుడ్‌లో జంట పక్షులుగా చెప్పుకునే జాబితాలో ఆలియాభట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాలు కూడా ఉన్నారు. వీరిద్దరూ వరుణ్‌ ధావన్‌తో కలిసి 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాతోనే ఆలియా.. సిద్ధార్థ్‌ మధ్య ప్రేమ చిగురించిందని బీటౌన్‌లో టాక్‌ వినిపించింది. అది నిజమే అన్నట్టుగా వాళ్లూ ప్రవర్తించారు. అయితే ఇటీవల వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలపై గతంలో ఓ సారి స్పందించిన ఆలియా.. మరోసారి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. . ప్రస్తుతం ఆలియా 'డియర్‌ జిందగీ'లో, సిద్ధార్థ్‌ మల్హోత్ర ఓ ఎన్నారై దర్శకుడి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఆలియా.. వరుణ్‌ ధావన్‌ కలిసి 'బద్రినాథ్‌ కీ దుల్హానియా' చిత్రంలోనే నటిస్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఆలియా.. సిద్ధార్థ్‌ ఎక్కడా కలిసి కనిపించట్లేదు. మాట్లాడుకున్న వార్తలు కూడా వినిపించట్లేదు. దీంతో ఈ జంట విడిపోయిందని బీటౌన్‌లో పుకార్లు రావడంతో.. ''మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది. నేను వరుణ్‌తో కలిసి నటిస్తున్నాను. అందులో ఎలాంటి సమస్య లేదు. మేమంతా కలిసి ఇటీవల 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' చిత్రం విడుదలై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కూడా చేసుకున్నాం. అందరమూ చాలా బాగున్నాం. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నాం అంతే. కొంత మంది నేను సిద్ధార్థ్‌తో మాట్లాడట్లేదని అంటుంటే బాధగా ఉంటుంది'' అని చెప్పుకొచ్చింది ఆలియా.

No comments:

Powered by Blogger.