ఇద్దరు భామల మధ్య కోల్డ్వార్!
ముంబయి: బాలీవుడ్ హీరోయిన్లు దిశా పటానీ, అమైరా దస్తూర్ల మధ్య కోల్డ్వార్ జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరూ ఇండో-చైనీస్ చిత్రమైన ‘కుంగ్ఫూ యోగా’లో జాకీచాన్కి జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రొమో ఒకటి బయటికొచ్చింది. అందులో దిశా పటానీనే ఎక్కువగా కనిపిస్తోంది కానీ అమైరా మాత్రం అంతగా కన్పించలేదు. దాంతో సినిమాలో తానే ప్రధాన హీరోయిన్ అంటూ ప్రకటిస్తూ తిరుగుతోందట దిశా. అందుకే అమైరాకి ఆమె మీద కోపంగా ఉందట. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు భారత్తో చేసుకున్న మూడు చిత్రాల ఒప్పందంలో భాగంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో సోనూ సూద్ కూడా కీలక పాత్రలో నటించాడు.
No comments: