pop

అన్నం ముద్దల పోటీలో పాల్గొన్నాడు.. వేగంగా మింగి మృతి చెందాడు


టోక్యో: అన్నం ముద్దలను వేగంగా మింగే పోటీలో పాల్గొన్న ఓ యువకుడు, అనంతరం తీవ్ర అస్వస్థతతో మృతి చెందాడు. జపాన్‌లోని హికోన్ నగరంలో నవంబర్ 13న స్థానికంగా పండించే వరి అన్నం ముద్దల పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీలో ఐదు ముద్దలను ఎవరు ముందుగా మింగుతారో వారే విజేతలు. అయితే మూడో రౌండ్‌లో పాల్గొన్న ఓ యువకుడు త్వరత్వరగా ముద్దలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. జపాన్‌లో ఇలాంటి తిండి పోటీలు సాధారణమే అయినా అతిగాను, అతి వేగంగా తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Powered by Blogger.