సినిమా చూసి.. చెంప చెళ్లుమనిపించారు
హైదరాబాద్: నటుడు నరేశ్ని తన తల్లి విజయ నిర్మల చెంపదెబ్బ కొట్టారట. నిత్యామేనన్, క్రిష్ జె. సత్తార్, నరేశ్, కోటా శ్రీనివాసరావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఘటన’ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివకుమార్ సమర్పించారు. ఈ చిత్రాన్ని చూసిన విజయ నిర్మల అందులో ప్రతినాయకుడి పాత్ర పోషించిన నరేశ్ను చెంపదెబ్బతో ప్రశంసించారట. ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘‘ఘటన’ సినిమా చూసి అమ్మ చెంప మీద కొట్టారు. ప్రతినాయకుడి పాత్రను చక్కగా పోషించినందుకు ఇది నా బహుమతని చెప్పారు. తర్వాత దీవిస్తూ.. ఇది నా కుమారుడి కోసం.. అన్నారు’ అని నరేశ్ ట్వీట్ చేశారు. నరేశ్ ప్రస్తుతం పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన ‘శ్రీ శ్రీ’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
No comments: