బాబోయ్! జియో బిల్లులు వచ్చేస్తున్నాయ్!!
విజయవాడ : మూడు నెలల పాటు ఫ్రీ... బిల్లులు రావంటూ... ఎగబడి మరీ జియో సిమ్లు తీసుకున్నారు అందరూ. ఇపుడు ఆ సంబడం తీరిపోయే రోజులు మొదలయ్యాయి. జియో బిల్లులు వచ్చేస్తున్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా కస్టమర్లకు జియో రెంటల్ కాల్ బిల్స్ రావడం మొదలైంది. సంచలన నిర్ణయంగా జియోను రిలయన్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మూడు నెలలపాటు ఫ్రీ అని చెప్పారు. అయితే, ఆ గడువు దాటిపోయింది. మీరు అదనంగా వాడిన కాల్స్కు డబ్బు, రెంటల్స్ పే చేయాలంటూ వినియోగదారులకు బిల్స్ రావడం మొదలైంది. దీనితో ఫ్రీగా వాడుకుంటున్న జియో ఫోన్ వినియోగదారులంతా ఇపుడు బాబోయ్ అని షాక్ అవుతున్నారు. తెల్లవార్లూ జియోలో మాట్లాడినవారు ఫోన్ను స్విచాఫ్ చేసేస్కుంటున్నారు.
No comments: