pop

యూపీలో ఘోర రైలు ప్రమాదం : 63 మంది మృతి


లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పాట్నా - ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ రైలు పాట్నా నుంచి ఇండోర్ వెళ్తుండగా.. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోగా.. 150 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు, వైద్యులు గాయపడిన వారికి ఘటనాస్థలిలోనే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.

No comments:

Powered by Blogger.