6 కోట్ల విలువైన సిగరెట్ల లూటీ
ఆంధ్రప్రదేశ్లో దోపిడీ దొంగ లు రెచ్చిపోయారు. అనకాపల్లి-ఆనందపురం రహదారిపై రూ.6 కోట్ల విలువగల సిగరెట్లను లూటీచేశారు. శనివారం రాత్రి పశ్చిమ బెంగాల్ హౌరా నుంచి ఓ కంటైనర్ హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యలో ఏఎస్పేట వద్ద దోపిడీకి గురైంది. కంటైనర్ నుంచి సిగరెట్ కాటన్లను దోపిడీ దొంగలు మరో లారీలోకి తరలించుకొని పరారయ్యారని అనకాపల్లి డీఎస్పీ ఏ పురుషోత్తం తెలిపారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాగా అనుమానిస్తున్నామని ఆయన చెప్పారు.
No comments: