pop

ఇంధ‌న ట్ర‌క్కు పేలి 73 మంది మృతి


క‌ఫిరిజాంగ్ : ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో ఇంధ‌న ట్ర‌క్కు పేలిన ఘ‌ట‌న‌లో 73 మంది మృతిచెందారు. టీట్ ప్రావిన్స్‌లోని క‌ఫిరిజాంగ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ట్ర‌క్కు నుంచి ప్ర‌జ‌లు ఇంధాన్ని తీసుకుంటున్న స‌మ‌యంలో పేలుడు సంభ‌వించిన‌ట్లు ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ ప్ర‌మాదంలో మ‌రో 110 మంది గాయ‌ప‌డ్డారు. అందులో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్ర‌మాదానికి గురైన ట్ర‌క్కు నుంచి కారుతున్న ఇంధ‌నాన్ని సేక‌రించుకునేందుకు భారీ సంఖ్య‌లో అక్క‌డికి ప్ర‌జ‌లు చేరుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై స్థానిక ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. స్థానికుల దాడి వ‌ల్లే ఆ ట్ర‌క్కు పేలి ఉంటుంద‌ని కొంద‌రు అనుమానిస్తున్నారు. పోర్ట్ న‌గ‌రం బీరా నుంచి మాల్వాయికి ట్ర‌క్కు ఇంధనాన్ని తీసుకెళ్లుతోంది.

No comments:

Powered by Blogger.