pop

చావుతో సెల్ఫీ తీసుకున్నాడు..!


హైదరాబాద్: చనిపోయేముందు సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడో ఏమో గానీ... హైదరాబాద్‌లోని క్రాంతి‌కుమార్ అనే యువకుడు ప్రాణాలు వదిలే ముందు ఒక సెల్ఫీ తీసుకొన్నాడు. నగరంలోని రామంతపూర్ ప్రాంతంలో భార్యా బిడ్డలతో ఉంటూ క్యాబ్ డ్రైవరుగా కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొద్ది కాలం నుంచి ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడంతో వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియకనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలుపుతున్నారు. తన భార్య చీరను ఫ్యాన్‌కు బిగించి క్రాంతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలోనే తన ఫోనుతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఘటనతో భార్య,ఇద్దరు పిల్లలను పోషించే దిక్కులేకుండా పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని మరణానికి గల కారణాలేమైనా ఉన్నాయోమోనని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Powered by Blogger.