pop

ఇడ్లీ కోసం హత్య చేసాడు..


Quarrel-over-money-to-buy-iఇటీవల కాలం లో హత్యలు చేయడం చాల కామన్ అయిపొయింది. చంపడానికి ఏదో పెద్ద కారణం అవసరం లేదు రూ. 10 ల ఇడ్లీ కోసం కూడా గొడవపడి చంపుతున్నారు..ఏంటి ఇడ్లీ కోసం చంపుతారా అని అనుకుంటున్నారా..ఇది నిజం. ఈ ఘటన తాజాగా తమిళనాడు లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. శరవణన్ (35), మరప్పన్ (45) అనే ఇద్దరు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి మద్యం తాగారు. శరవణన్ ఇడ్లీలు కొని తెస్తాను డబ్బులు ఇవ్వమని మరప్పన్ ను అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించాడు. మరోసారి అడుగుతూ మళ్లీ మద్యం తాగడం మొదలు పెట్టారు. శరవణన్ ఇడ్లీలు కొని తెస్తాను డబ్బులు ఇవ్వమని మరప్పన్ ను అడిగాడు. మరప్పన్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయి , అది కాస్త కొట్టుకునే దాక దారితీసింది. తాగిన మైకంలో శరవణన్ మరప్పన్ ను కిందకి తోసేశాడు. దీంతో తలకి బలమైన గాయాలవ్వడంతో హాస్పటల్ లో చేర్చారు. రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం మరణించాడు. దీంతో శరవణన్ ఫై మరప్పన్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.

No comments:

Powered by Blogger.