pop

ఏటీఎంల వద్దే ప్రజల పడిగాపులు


Image result for atm hyderabadహైదరాబాద్: అక్కడ క్యూలో జనం వేచి ఉన్నారు.. ఆ అయితే అక్కడ ఖచ్చితంగా ఏటీఎం ఉండే ఉంటుందిలే అని ప్రస్తుతం జనానికి ఈజీగా అర్థమైతుంది. పాత నోట్లు రద్దు చేసి నేటితో ఐదురోజులు గడుస్తున్నా ప్రజలకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. నేడు బ్యాంకులకు సెలవు కావడంతో కొత్తనోట్ల కోసం గంటల తరబడి ఏటీఎంల దగ్గరే వేచి ఉండాల్సివస్తుంది. అయినా కూడా పరిమితి వరకు మాత్రమే కొత్తనోట్లు విత్ డ్రా అవుతున్నాయి. పనులు వదిలేసి మరీ గంటలతరబడి ఏటీఎంల దగ్గర నిలబడినా కూడా పరిమితి ఉన్న కారణంగా సరిపోయేంత డబ్బు విత్ డ్రా చేయలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క నగదు పెట్టిన కొద్దిసేపటికే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. అంతేకాదు విత్ డ్రా చేసుకున్న డబ్బులకు చిల్లర కూడా దొరకడంలేదు. దీంతో ప్రజల ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. ఇలా ఎన్నిరోజులని మేం ఏటీఎంల చుట్టూ తిరగాలి, ఎన్నిరోజులని చిల్లరకోసం ఇబ్బందులు పడాలని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Powered by Blogger.