pop

అంబానీ, అదానీలకు ముందే తెలుసు... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!


జైపూర్: రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోట జిల్లాలోని లద్‌పుర ఎమ్మెల్యే భవాని సింగ్ రాజావత్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. ఈ నోట్ల రద్దు గురించి అంబానీ, ఆదానీలకు ముందే తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లు ఇందుకు సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాదు, కొత్త నోట్లను ప్రవేశపెట్టడంపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. ముందు తగినంత కొత్త నోట్లను ముద్రించి, ఆ తర్వాత ప్రకటన చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. పెట్రోల్ ధరలపై అర్థరాత్రి ప్రకటన చేసినట్లుగా నోట్ల రద్దు ప్రకటన ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నెట్‌లో హల్‌చల్ చేసింది. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఆయన మాట మార్చారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిదని చెప్పారు. మరి ఆ వీడియో సంగతేంటని ఆయన్ని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

No comments:

Powered by Blogger.