పాక్ సరికొత్త అబద్ధాలు
న్యూఢిల్లీ: తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన భారత సబ్మెరైన్ను గుర్తించి తరిమికొట్టామని పాక్ నేవీ ప్రకటించుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అలుముకున్న తరుణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపిందంటూ జియో న్యూస్ కథనం ప్రసారం చేసింది. పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత సబ్మెరైన్ను తరిమితరిమి కొట్టామని పాక్ నేవీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జియో న్యూస్ వెల్లడించింది. భారత సబ్మెరైన్ను తిప్పికొట్టే సత్తా తమకుందనేది మరోసారి నిరూపణ అయిందని పాక్ నేవీ ప్రకటించుకుంది. భారత్ చేసే ఇలాంటి యత్నాలను ఎప్పుడైనా ఇలాగే తిప్పికొట్టగలమని ప్రకటించుకుంది. అయితే ఈ కథనాలను ఇండియన్ నేవీ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతోందని, సరికొత్త అబద్ధాలు చెబుతోందని ఆరోపించింది.
No comments: