pop

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఫ్యామిలీని కలిసిన టాప్ హీరోయిన్..!


ముంబయి: కరుడుగట్టిన ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఫ్యామిలీని బాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధాకపూర్ కలిసింది. హీరోయిన్ ఎందుకు కలిసినట్లు అని ఆశ్చర్యపోతున్నారా.. దావూద్ సోదరి హసీనా పార్కర్‌‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది బాలీవుడ్‌‌. ఈ చిత్రానికి దావూద్ సోదరి పేరు ‘హసీనా’ అని ఖరారు చేయడం గమనార్హం. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా ఇందులో నటిస్తున్నాడు. హసీనా సినిమాలో వాస్తవాలను తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు అపూర్వ లఖియా. చిత్రబృందం కొద్ది సేపటి క్రితం దావూద్ సోదరి కుటుంబాన్ని కలిసింది. సుమారు రెండు గంటలపాటు హసీనా జీవిత విశేషాలను, చిత్రంలో ఏం తెరకెక్కించబోతున్నామనే విషయాలను మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ముఖ్యంగా స్లమ్ డెవలప్‌మెంట్ అథారిటిస్ డీలింగ్స్‌‌ గురించి చూపించబోతున్నామని దర్శకుడు చెప్పాడు. అనంతరం శ్రద్ధా మీడియాతో మాట్లాడుతూ హసీనా తమకు బాగా సహకరిస్తున్నారు.. ఆఖరికి హసీనా ముక్కు పుడకను ఇవ్వమంటే కాదనుండా ఇచ్చిందని శ్రద్ధా మీడియాతో చెప్పింది. హసీనాకు ముగ్గురు పిల్లలున్నారు.

No comments:

Powered by Blogger.