అతిలోకసుందరి కుమార్తెపై వస్తున్న రూమర్స్ నిజమేనా..!
ఎప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందో తెలియదు కానీ వెటరన్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ ఎప్పటికైనా హీరోయిన్గా మారటం ఖాయమనే చెప్పాలి. హీరోయిన్కు కావాల్సిన లక్షణాలన్నీ ఫుల్గా ఉన్న ఈ స్టార్ డాటర్ అప్పుడప్పుడు పార్టీల్లో చిట్టిపొట్టి దుస్తుల్లో కనిపిస్తూ మూవీ మేకర్లను, సినీ ప్రియులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. అయితే హీరోయిన్గా కుమార్తె కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న శ్రీదేవి అందుకోసం బీ-టౌన్లోని మూవీ మేకర్లను అప్రోచ్ అవుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. స్టూటెండ్ ఆఫ్ ది ఇయర్-2లో జాన్వి నటించటం ఖాయమని రూమర్స్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయ్. ఇవన్నీ ఎలా ఉన్నా తాజాగా ఎంట్రీ ఇవ్వబోతున్నది ఓ మరాఠీ సినిమా రీమేక్తో అని న్యూస్ వినిపిస్తోంది. మరాఠీలో కేవలం రూ.4కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా వంద కోట్లు వసూలు చేసిన సైరాట్ మూవీ బాలీవుడ్ రీమేక్లో జాన్వీ నటించబోతోందట. ఈ సినిమాకు చెందిన బాలీవుడ్ రైట్స్ను ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. జాన్వీని దృష్టిలో పెట్టుకునే కరణ్ ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తానికి అతిలోక సుందరి కూతురు సంబంధించిన నయా రూమర్ నిజం అవుతుందా లేదా ఇది కూడా ఓ పుకారుగానే మిగిలిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.!
No comments: