pop

నగరంలో చలి..12.9 డిగ్రీలు..!


ఉత్తరభారతం నుంచి శీతలగాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చలిగాలుల నేపథ్యంలో 5 రోజులపాటు వాతావరణశాఖ శీతల గాలుల హెచ్చరికలు జారీచేసింది. సాధారణంగా మద్నాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతు న్నాయి. రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.9 డిగ్రీలకు చేరడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. రెండురోజులుగా నగరంలో సాధారణకంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో చలితీవ్రత మరింతగా పెరిగే అవకాశముం దని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం నగరంలో కనిష్ఠంగా 12.9 డిగ్రీలు, గరిష్టంగా 30.2 డిగ్రీలు నమోదయ్యింది.

No comments:

Powered by Blogger.