ఏటీఎంకి అంత్యక్రియలు
చెన్నై : ఏ రోజుకు ఆ రోజు ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపిస్తున్న ఏటీఎంలపై జనం విరుచుకుపడుతున్నారు. తమ అలసట, అసహనం, ఆగ్రహాన్ని తోసిన పద్ధతుల్లో బయటకు వెళ్లగక్కుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ ఏటీఎం సెంటర్కు కొంతమంది పూల దండలు వేశారు. ఏటీఎం డోర్కు వినూత్నంగా అంత్యక్రియలు చేశారు. అంతేకాదు, ఆ సమయంలో కొంతమంది... సొంత మనిషి పోయినట్టు వెక్కి వెక్కి ఏడ్చి, సీనును బాగా పండించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
No comments: