గుడ్డు కన్నా తక్కువ ధరకు కోడి... కోళ్ళ వ్యాపారి బంపర్ ఆఫర్
లండన్ : ఆ కోళ్ళు రుచికరమైన గుడ్లు పెట్టి, జనానికి విందు చేశాయి. సంవత్సరానికిపైగా ఇలాంటి సేవ చేసిన ఆ కోళ్ళను వదిలించుకోవాలని ఆ కోళ్ళఫారం యజమాని నిర్ణయించుకున్నాడు. చివరి క్షణంలో వాటి అదృష్టానికి పరీక్ష పెట్టాడు. నార్త్ యార్క్షైర్లోని సెల్బీ సమీపంలో ఉన్న బాబ్థోర్ప్ హాల్ ఫార్మ్ యజమాని షీనా సీల్స్ తన కోళ్ళ ఫారంలోని ఒక్కో కోడిని 1 పౌండ్కు అమ్ముతానని ప్రకటించాడు. ఈ కోళ్ళు 13 నెలలకు పైగా గుడ్లు పెట్టాయని, ఇంకా వాటి నుంచి గుడ్లను ఆశిస్తే, నాణ్యత తగ్గుతుందని, జనం ఇష్టపడరని షీనా చెప్పారు. షీనా కుమార్తె ఎల్లీ (18)కి ఓ ఐడియా వచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని గంటల్లోనే 1,000 కోళ్ళను కొనేందుకు కొందరు సిద్ధమయ్యారు. క్రిస్ట్మస్ అద్భుతం ముందుగానే వస్తుందని ఆశిస్తున్నామని ఎల్లీ చెప్పింది.
No comments: