pop

ఐదో వికెట్ కోల్పోయిన భారత్


విశాఖ: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 167 పరుగులు చేసిన కెప్టెన్ కోహ్లీ అలీ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకు ముందు బంతిని ఎదుర్కొన్న అశ్విన్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న స్టోక్ నేలపాలు చేశాడు. దీంతో ఓ పరుగు తీశారు. తర్వాతి బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మాత్రం ఒడిసిపట్టడం విశేషం. ప్రస్తుతం భారత్ 104 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. అశ్విన్ 23, సాహా 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

No comments:

Powered by Blogger.