pop

ఆమెకు కిడ్నీ నేనిస్తా


కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధ పడుతున్న విదేశ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పూర్తిగా కోలుకోవాలంటే ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు పేర్కొన్న నేపథ్యంలో..భోపాల్ లోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందించాడు. గౌరవ్ దంగి అనే ఈ కానిస్టేబుల్..ఆమెకు కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చాడు. తన బ్లడ్ గ్రూప్ ఆమెకు మ్యాచ్ అయితే మూత్ర పిండాన్ని ఇవ్వడానికి రెడీ అని, సుష్మ వంటి మంచి లీడర్ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన అభిమతమని గౌరవ్ అంటున్నాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపాడు. మరి ఇందుకు సుష్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

No comments:

Powered by Blogger.