pop

ఎస్పీ బాలుకు సెంటినరీ అవార్డు ప్రదానం..


SP Balasubrahmanyam felicitated by Union Minister Venkaiah Naidu గోవా: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సెంటినరీ అవార్డు అందుకున్నారు. పనాజీలో జరుగుతున్న 47వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎస్పీ బాలుకు సెంటినరీ అవార్డును ప్రదానం చేసి, శాలువాతో సత్కరించారు. పనాజీలో చలన చిత్రోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్య, మనోహర్ పారికర్‌తోపాటు సినీరంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తన గాత్ర మాధుర్యంతో దక్షిణాది సినీ పరిశ్రమకు సేవలందించిన బాలుకు కేంద్రం సెంటినరీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments:

Powered by Blogger.