pop

పిల్లలు తగ్గిపోతున్నారు... పెళ్లి చేసుకోండి: చంద్రబాబు


‘కొందరు కులాలు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, నాది ఒకే కులం పేద కులమని’ సీఎం చంద్రబాబు వ్యాఖ్యనించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకే కమిటీ చేశామని తెలిపారు. అప్పట్లో డ్వాక్రా సంఘాలను చూసి నవ్వారని, వారికి బుద్ధి వచ్చేలా మీరు ఎదిగారని డ్వాక్రా మహిళలను ఉద్దేశించి సీఎం అన్నారు. పెళ్లి చేసుకోకపోతే పిల్లలు తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని, అందుకే పెళ్లి చేసుకోండి..పిల్లలను కనండని పిలుపునిచ్చారు. సాంకేతికంగా అభివృద్ధి చెందితేనే ఆర్ధికాభివృద్ధి సాధ్యమని బాబు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మధ్యాహ్న భోజనం మీకే అప్పగించామని, 175 ఇండస్ట్రీయల్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలు పారిశ్రామిక వేత్తలు కావాలని, సకాలంలో అప్పు చెల్లిస్తేనే తిరిగి రుణం వస్తుందన్నారు. జన్‌ధన్‌ ఖాతాలున్నవారు రూపే కార్డులు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. రూపే కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని, ఆన్‌లైన్‌ లావాదేవీలు జరగాలని, మొబైల్‌ బ్యాంకింగ్‌ పెరగాలని చంద్రబాబు పేర్కొన్నారు.

No comments:

Powered by Blogger.