అమ్మ, నాన్న పట్టించుకోవడం లేదని...చిన్నారి ఏం చేసిందంటే...
గుంటూరు, మాచర్ల టౌన్: తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోక ఇంటి నుంచి బయలుదేరి మాచర్ల పట్టణానికి చేరుకున్న చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు పట్టణ పోలీసులు చర్యలు చేపట్టారు. గుంటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల దుర్గ తల్లిదండ్రులు కోటేశ్వరరావు, మల్లీశ్వరీలు పట్టించుకోకపోవడంతో మాచర్ల-భీమవరం ప్యాసింజర్ రైలు ఎక్కి వారం రోజుల క్రితం మాచర్ల పట్టణానికి చేరుకుంది. రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా రైల్వే స్టేషన్ సిబ్బంది పట్టణ పోలీస్స్టేషన్కు ఆ పాపను చేర్చారు. అర్బన్ సీఐ సత్యకైలాస్నాథ్ ఆ పాపను స్వామి వివేకానంద స్టూడెంట్ హోం నిర్వాహకుడు మెట్టు గోవిందరెడ్డికి అప్పగించారు. వారం గడుస్తున్నా ఆ పాప తల్లిదండ్రులు రాకపోవడంతో గోవిందరెడ్డి ఆ పాపను తిరిగి గురువారం పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అర్బన్ ఎస్ఐ లక్ష్మయ్య గుంటూరులోని నల్లపాడు పోలీస్స్టేషన్కు ఆ పాపను చేర్చేందుకు కానిస్టేబుల్ను సహాయంగా ఇచ్చి పంపారు.
No comments: