pop

మిశ్రాను బలిపశువును చేశారు'


'మిశ్రాను బలిపశువును చేశారు''మిశ్రాను బలిపశువును చేశారు' విశాఖ:ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో వైఫల్యం చెందిన టీమిండియా జట్టులో స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కడే బలిపశువు అయ్యాడని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించాడు. ఆ మ్యాచ్ లో భారత జట్టు మొత్తంగా విఫలమైతే, రెండో టెస్టులో అమిత్ మిశ్రాకు స్థానం కల్పించకపోవడం తనకు ఆశ్చర్యం కల్గించిందన్నాడు. 'రెండో టెస్టు తుది జట్టులో అమిత్ కు చోటు దక్కలేదు. ఈ నిర్ణయం నాకు ఆశ్చర్యం కల్గించింది. తొలి టెస్టులో భారత్ వైఫల్యం చెందితే అమిత్ మిశ్రా బలిపశువును చేశారని నేను అనుకుంటున్నా'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మరొకవైపు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. సెంచరీల దాహంతో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లి ఒక బ్యాటింగ్ లోనే కాదు.. వ్యక్తిత్వంలో కూడా చాలా ఉన్నతమైన వాడని కొనియాడాడు. అతనొక రోల్ మోడల్ అంటూ గవాస్కర్ ప్రశంసించాడు
.

No comments:

Powered by Blogger.